వ్యాక్సిన్ తీసుకుంటేనే సాలరీ

వ్యాక్సిన్ తీసుకుంటేనే సాలరీ

సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ ను అరికట్టేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొందరు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరికొందరు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు.దీంతో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని..లేదంటే జీతాలు కట్ అవుతాయని ఫిరోజాబాద్‌ జిల్లా అధికారులు చెబుతున్నారు. ‘నో వ్యాక్సినేషన్‌.. నో సాలరీ’ పేరుతో జిల్లా కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుంటే మే నెల జీతం రాదని.. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా డిపార్ట్ మెంట్ల ఇంచార్జీలకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల లిస్టును సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలన్నారు.