
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 155లో గల ఎకరా 14 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిలో చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. బుధవారం తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఆర్ఐ రాజేశ్తమ సిబ్బందితో అక్కడికి వెళ్లారు. ప్రహరీని కూల్చి గేటును తొలగించారు. అనంతరం అక్కడ ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.