పనిమనిషి అరెస్టు.. 11.18 లక్షలు స్వాధీనం
కూకట్ పల్లి, వెలుగు : ఓనర్ ఇంట్లో రూ. 24.50 లక్షలు కొట్టేసిన పని మనిషిని అరెస్టయ్యింది. కేపీహెచ్బీకాలనీ.9 ఫేజ్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్ఫ్లాట్నంబర్ –101లో ఉండే పోచంపల్లి కిషన్రావు(42) రియల్ఎస్టేట్ వ్యాపారి. మార్చిలో సొంతూరు మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో తన వ్యవసాయ భూమిని అమ్మగా రూ. 35 లక్షలు వచ్చాయి. వాటితో పాటు రియల్ఎస్టేట్పైసలు రూ. 10 లక్షలు, మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 40 లక్షలు తన బెడ్రూంలోని సూటు కేసులో దాచాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకి చెందిన లచ్చిగారి సాయవ్వ అలియాస్సాయమ్మ(44) 6 నెలల కిందట కిషన్రావు ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆమె సమీపంలోని గోకుల్ప్లాట్స్లో ఉంటుంది. గత నెల 30న ఉదయం కిషన్రావు వాకింగ్కు వెళ్లి ఇంటికొచ్చాడు. అతని బెడ్రూమ్లో నుంచి సాయమ్మ బయటకు రావడం చూసి ప్రశ్నించగా ఊడ్చేందుకు వెళ్లానని చెప్పింది. మధ్మాహ్నం సూట్కేసు తీసి చూడగా రూ. 40 లక్షలకుగాను 15.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతా డబ్బు సాయవ్వనే దొంగిలించిందని పోలీసులకు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితురాలిని అరెస్టు చేసి ఆమె నుంచి రూ. 11.18 లక్షలు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు.