ఓనర్​ ఇంట్లో  రూ. 24.50 లక్షలు కొట్టేసింది

ఓనర్​ ఇంట్లో  రూ. 24.50 లక్షలు కొట్టేసింది

పనిమనిషి అరెస్టు.. 11.18 లక్షలు స్వాధీనం
కూకట్ పల్లి, వెలుగు :  ఓనర్​ ఇంట్లో  రూ. 24.50 లక్షలు కొట్టేసిన పని మనిషిని అరెస్టయ్యింది.  కేపీహెచ్​బీకాలనీ.9 ఫేజ్​లోని సాయి నివాస్​ అపార్ట్​మెంట్​ఫ్లాట్​నంబర్​ –101లో ఉండే పోచంపల్లి కిషన్​రావు(42) రియల్​ఎస్టేట్ వ్యాపారి.  మార్చిలో సొంతూరు మెదక్​ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్​లో తన వ్యవసాయ భూమిని అమ్మగా రూ. 35 లక్షలు వచ్చాయి. వాటితో పాటు రియల్​ఎస్టేట్​పైసలు రూ. 10 లక్షలు, మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 40 లక్షలు తన బెడ్రూంలోని సూటు కేసులో దాచాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకి చెందిన లచ్చిగారి సాయవ్వ అలియాస్​సాయమ్మ(44) 6 నెలల కిందట కిషన్​రావు ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆమె సమీపంలోని గోకుల్​ప్లాట్స్​లో ఉంటుంది. గత నెల 30న ఉదయం కిషన్​రావు వాకింగ్​కు వెళ్లి  ఇంటికొచ్చాడు. అతని బెడ్​రూమ్​లో నుంచి సాయమ్మ బయటకు రావడం చూసి ప్రశ్నించగా ఊడ్చేందుకు వెళ్లానని చెప్పింది. మధ్మాహ్నం సూట్​కేసు తీసి చూడగా రూ. 40 లక్షలకుగాను  15.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతా డబ్బు సాయవ్వనే దొంగిలించిందని పోలీసులకు కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితురాలిని అరెస్టు చేసి ఆమె నుంచి రూ. 11.18 లక్షలు స్వాధీనం చేసుకుని, రిమాండ్​కు తరలించారు.