
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, వారి ప్రమోషన్లను రద్దు చేయాలని సీనియర్ అడ్వకేట్ చలిచీమల మోహన్ డిమాండ్ చేశారు. పోలీస్ యూనిఫామ్ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను సీజ్ చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు పొందారన్నారు. నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న అక్రమాస్తులపై ప్రత్యేకంగా విచారణ జరపాలని, ఏసీబీ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.