గంజాయి మత్తులో మహిళలను కొట్టిన యువకులు

గంజాయి మత్తులో మహిళలను కొట్టిన యువకులు

ఈ మధ్య కాలంలో  జనాలు ఏంతింటున్నారో.. ఏమో తెలియదు కాని... చిన్నదానికి పెద్దదానికి నానా రచ్చ చేస్తున్నారు. ఇక దానికి గంజాయి మత్తు ఎక్కిందంటే చాలు.. వారు ఏం చేస్తున్నారో వారికే అర్దంకాని పరిస్థితిలో నేటి యువత చిత్తవుతుంది.  సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటనే కుత్భుల్లాపూర్​ లో చోటు  చేసుకుంది.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​  పరిధిలో  కొందరు యవకులు హల్​ చల్​ చేశారు.  నివాసాల మధ్య.. డబుల్ బెడ్​ రూం ఇళ్ల మధ్యలో 22 వ బ్లాక్​ దగ్గర గంజాయి మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.  గంజాయి మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అక్కడున్న మహిళలపై చేయి చేసుకున్నారు.  అంతే కాకుండా బూతులు తిట్టుకుంటూ... అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ స్థానికులకు ఇబ్బంది కలిగేలా  వ్యవహరిస్తున్నారు.  రక్తం వచ్చేలా కొట్టుకుంటూ.. జనాలను బెంబేలెత్తిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.