రేపు ఢిల్లీలో రావత్ అంత్యక్రియలు

రేపు ఢిల్లీలో  రావత్ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ ల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్ లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరగనున్నాయి. తమిళనాడులోని వెల్లింగ్టన్ లో వీరి పార్థివ దేహాలకు నివాళులు అర్పించే కార్యక్రమం తర్వాత గురువారం సాయంత్రం ఢిల్లీకి మిలిటరీ ప్లేన్ లో తరలిస్తారు. ఢిల్లీలోని నివాసంలో వారి భౌతికకాయాలను శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కంటోన్మెంట్ లోని శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.