జీ20 సమిట్​తో సామాన్యులకు ఒరిగిందేమిటి.?: ఆర్జేడీ చీఫ్​ లాలూ యాదవ్​

జీ20 సమిట్​తో సామాన్యులకు ఒరిగిందేమిటి.?: ఆర్జేడీ చీఫ్​ లాలూ యాదవ్​

డియోగఢ్: జీ20 సమిట్​ వల్ల సామాన్య ప్రజలకు ఏం ఉపయోగమని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్​ లాలూ ప్రసాద్ ​యాదవ్  కేంద్రాన్ని​ ప్రశ్నించారు. సమిట్​కోసం భారీ మొత్తం ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు  మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోదీ ప్రత్నిస్తున్నారని విమర్శించారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదన్నారు. సోమవారం జార్ఖండ్‌‌లోని డియోగఢ్  జిల్లాలో ప్రఖ్యాత బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో లాలూ పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగాలేవన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు.