సాగర్ జలాలు చోరీ కాకుండా పహారా

సాగర్ జలాలు చోరీ కాకుండా పహారా

 కూసుమంచి, వెలుగు :  మంత్రుల ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి రెండు టీఎంసీల నీటిని సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదల చేశారు. నల్గొండ జిల్లాలోని దేవులపల్లి, పొనుగోడు రిజర్వాయర్లు నిండిన తర్వాత రెండు రోజులుగా సాగర్ జలాలు పాలేరు జలాశయానికి చేరుతుండడంతో శుక్రవారం నుంచి ఐబీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల నీటి చోరీ జరగకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాలేరు నీటిమట్టం 9.5 అడుగులు ఉంది. ఐబీ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సర్వేయర్ రవి, లస్కర్లు, కానిస్టేబుల్స్  ఉన్నారు.