రెండ్రోజులు వైన్స్ బంద్

రెండ్రోజులు వైన్స్ బంద్

లష్కర్ బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు బార్​లు, వైన్స్​ను మూసివేయనున్నారు.

గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, తార్నాక, వారాసిగూడ, బేగంపేట, బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, మహంకాళి పీఎస్​, మార్కెట్ ​పీఎస్​, తిరుమలగిరి, బొల్లారం ప్రాంతాల్లో  వైన్స్, బార్​ల​ను మూసివేయాలని ఎక్సైజ్​ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏరియాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది.