లష్కర్ బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్స్ను మూసివేయనున్నారు.
గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, తార్నాక, వారాసిగూడ, బేగంపేట, బోయిన్పల్లి, మారేడ్పల్లి, మహంకాళి పీఎస్, మార్కెట్ పీఎస్, తిరుమలగిరి, బొల్లారం ప్రాంతాల్లో వైన్స్, బార్లను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏరియాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది.