తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు.. రూ. 49 లక్షలు, 4 కిలోల బంగారం..10 కిలోల వెండితో జంప్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు.. రూ. 49 లక్షలు, 4 కిలోల బంగారం..10 కిలోల వెండితో జంప్

సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధీ కాలనీలో భారీ చోరీ జరిగింది. రాహుల్ గోయల్ అనే వ్యక్తి ఇంట్లో  రూ. 5 కోట్ల సొత్తును అపహరించారు దొంగలు. ఇందులో రూ. 49 లక్షల నగదు, 4  కిలోల బంగారం, 10 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. ఇంట్లో పనిచేసే వాళ్లే ఈ చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

రాహుల్ గోయల్ కుటుంబం  జులై  9న ఫాంహౌస్‌కు వెళ్లింది. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి వున్నాయి. ఇంట్లోని రూ. 49 లక్షల నగదు, 4కిలోల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో లబోదిబో మన్న బాధితులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఇంట్లో పనిచేసే నేపాల్ వాళ్లు కనిపించకపోవడంతో వాళ్లే.. ఈ చోరీ చేసినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ టీవీ ఆధారంగా  నిందితుల కోసం భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గాలిస్తున్నారు. ఐదేళ్ల నుంచి నేపాలీ కుటుంబ తమ ఇంట్లో పనిచేస్తుందని రాహుల్ గోయల్ తెలిపారు.