సంగారెడ్డి జిల్లా: అభం శుభం ఎరుగుని ఏడేళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. బాలికను అపహరించిన దుండగులు జోగిపేట వైపు వాహనంలో పారిపోతుంటే.. చౌటకూరు మండలం శివ్వంపేట వద్ద కిడ్నాపర్లను బాలిక బంధువులు, స్థానికులు కలసి అడ్డుకున్నారు. కిడ్నాపర్ల చెరలో నుంచి బాలికను రక్షించి 108 లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పుల్కల్ పోలీసులు. కిడ్నాప్ కు గురైన బాలిక నిజామాబాద్ జిల్లా బిచ్కుంద కు చెందిన బాలికగా గుర్తించారు. కిడ్నాపర్లు పట్టుబడిన సందర్బంగా కిడ్నాపర్లకు బాలిక బంధువుల మధ్య ఘర్షణ కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.