సౌతాఫ్రికా 229 ఆలౌట్: 7 వికెట్లతో శార్దూల్ అరుదైన రికార్డ్

సౌతాఫ్రికా 229 ఆలౌట్: 7 వికెట్లతో శార్దూల్ అరుదైన రికార్డ్

జొహనెస్‌బర్గ్ :  టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.  ఓవర్‌ నైట్‌ స్కోరు 35/1తో ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికాను శార్దూల్‌ ఠాకూర్‌ దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటడంతో  సౌతాఫ్రికా 229కే కుప్పకూలింది.  అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో శార్ధూల్‌ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది.
 

శార్దూల్ రికార్డ్

శార్దూల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. జొహనెస్‌బర్గ్‌ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే (6/53)  తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆ తర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్‌ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్‌ని అందుకున్నారు. ఇప్పుడు శార్దూల్‌ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్‌లో ఆరో టెస్ట్‌ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం.