
బక్రీద్ సందర్భంగా సిటీలో శుక్రవారం గొర్రెలు, మేక పొటేళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, జమ్ముకాశ్మీర్, రాంపూర్, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జీవాలను ఇక్కడికి అమ్మకానికి తీసుకొచ్చారు. మటన్ కొట్టే మొద్దులు, కత్తులు, మేకలకు అవసరమైన గడ్డిని విరివిగా విక్రయించారు. కొన్ని ప్యూర్ బ్రీడ్ పొటేళ్లు భారీ ధర పలికాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శానిటేషన్ ఏర్పాట్ల పనులను బల్దియా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు.