షెర్లిన్ చోప్రాపై శిల్పా శెట్టి 50 కోట్ల పరువునష్టం దావా 

షెర్లిన్ చోప్రాపై శిల్పా శెట్టి 50 కోట్ల పరువునష్టం దావా 

పోర్న్ వీడియోల కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. ఇటీవలే  బెయిల్ పై బయటకు వచ్చాడు. మరోవైపు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది.

ఈ క్రమంలో షెర్లిన్ పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్ పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.  షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని చెప్పారు శిల్ప, రాజ్ తరపు లాయర్. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని చెప్పారు. షెర్లిన్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు.