జూన్ 9న రైతులతో కేంద్రమంత్రి ముఖాముఖి

 జూన్ 9న  రైతులతో కేంద్రమంత్రి ముఖాముఖి
  • హైదరాబాద్​ చేరుకున్న శివరాజ్​సింగ్​ చౌహాన్​

శంషాబాద్, వెలుగు: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

అక్కడి నుంచి కేంద్రమంత్రి ఐటీసీ కాకతీయ హోటల్ కు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేసి, సోమవారం ఇబ్రహీంపట్నంలో రైతులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో మిల్లెట్స్ పై జరిగే అవగాహన కార్యక్రమానికి హాజరుకానున్నారు.