కరోనా కట్టడికి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం

కరోనా కట్టడికి  సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం

ప్రస్తుతం భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ భారీ విరాళం ప్రకటించింది. దేశంలో  కరోనా సహాయచర్యలకు రూ.30 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కొవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాల కోసం అందిస్తున్నట్టు సన్ టీవీ తెలిపింది. సన్ టీవీ అధీనంలోని అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు ప్రకటించింది. తద్వారా భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో అవేర్ నెస్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది సన్ టీవీ సంస్థ.