- టీమిండియాకు మెంటర్గా ఎంఎస్ ధోని
యూఏఈ వేదికగా జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్కప్లో బరిలోకి దిగే టీమిండియా జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. టీమిండియాకు ఎస్ఎస్ ధోని మెంటర్గా వ్యవహరిస్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే జట్టులో అశ్విన్కు స్థానం దక్కగా వ్యక్తిగత సమస్యల కారణంగా శిఖర్ ధావన్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ కోసం తాత్కాలిక అవసరాల కోసం ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. రిషబ్ పంత్ కు తోడు మరో కీపర్ గా ఇషాన్ కిషన్ కు చోటు కల్పించారు. హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కు కూడా చోటు దక్కలేదు. ఐసీసీ నిబంధన మేరకు జట్టును ప్రకటించిన బీసీసీఐ అక్టోబర్ 10 వరకు తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైఎస్ కెప్టెన్), కెల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.