భారత్ - పాక్ మ్యాచ్ రోజు ఎవరికీ కనపడను

భారత్ - పాక్ మ్యాచ్ రోజు ఎవరికీ కనపడను
  • భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా ఉండదు. హైవోల్టేజ్ సృష్టించే మ్యాచ్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఇవాళ టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన నేపథ్యంలో ఈనెల 24వ తేదీన భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో తాను సోషల్ మీడియాలో ఎవరికీ కనపడకుండా.. అందకుండా పోతానంటూ సానియా మీర్జా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.  చిరకాల దాయాదులైన భారత –పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సమయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉద్వేగంతో ఉంటారని.. అందుకే తాను విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకు ఆ రోజు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సానియా మీర్జా స్పష్టం చేసింది. 
భారత టెన్నిస్ స్టార్, మన హైదరాబాదీ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న నేపథ్యంలో సానియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్టు ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించ లేదు. ఇరు  జట్ల మధ్య ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య 5 మ్యాచ్చులు జరుగగా భారత్ 4 మ్యాచుల్లో గెలిచి  ఆధిక్యంలో ఉండగా మరో మ్యాచ్‌ రద్దైంది. గణాంకాలు గురించి విశ్లేషించుకుంటూ, చర్చించుకుంటూ  క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సానియా మీర్జా స్పందనపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)