GO 317పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 

GO 317పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 

హైదరాబాద్: స్థానిక నిరుద్యోగ యువత ఉద్యోగాలను మరియు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల స్థానికతను కొల్లగొడుతున్న 317 జీవో ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. 317 జీవోను రద్దు  చేయాలని ముఖ్యమంత్రి కే సి ఆర్ కు  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు సుమారు 3 లక్షల 7 వేల మంది యొక్క స్థానికత మరియు లక్షలాదిమంది నిరుద్యోగ యువత స్థానిక ఉద్యోగాలను కొల్లగొడుతున్న 317 జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 
ఆదివారం సిటీలోని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జి.నిర్మల , రాష్ట్ర కోశాధికారి గడ్డం బాలస్వామి, భోగ శ్రీనివాస్, జి ఆనంద్, యు ఎఫ్ ఏ యాకూబ్ పాషా, బొడ్డు ప్రసాద్, విఠల్, ఆనంద్ కలాల్, విజయ, అంజనీ కుమారి, రమ, నళిని, జాజుల రంజిత్, గౌతం చారి, రేవంత్, కెంపుల నాగరాజు తోపాటు   33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 

ఉద్యమ కార్యాచరణ ఇదే

07.02.2022 తేదీన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి 317 జీవో రద్దు కై వినతి పత్రం సమర్పణ.

08.02.2022 రోజున నియోజకవర్గాల్లో  ఎంపీ లేదా ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించడం.

10.02.2022 కలెక్టరేట్ ఆఫీసుల వద్ద ధర్నా.

13.02.2022 సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ను కలిసి చర్చించడం.

15.02.2022, రాష్ట్ర గవర్నర్ ని కలవడం

20.02.2022 రోజున 317 జిఓ బాధితులతో ఇందిరాపార్కు వద్ద ఒక రోజు దీక్ష.

22.02.2022 రోజున కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులకి వినతి పత్రం సమర్పణ.

ప్రధాన డిమాండ్లు:


రెండు నెలల పీ.ఆర్.సీ. బకాయిలు ఇదే ఆర్ధిక సంవత్సరంలో విడుదల చేయాలి.
సీపీఎస్ రద్దు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
 వి ఆర్ వో లకు డ్యూటీ చార్ట్ రూపొందించడంతో పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించాలి.
పంచాయతీ సెక్రెటరీలకు రోజువారీ హాజరు కొరకు ఉదయం ఏడు గంటలకి వాట్సాప్ ద్వారా ఫోటో పంపడం లాంటి అనాగరిక చర్యలని మానుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కు చెందిన తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించాలి.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం తదితర  సమస్యలపై వెంటనే దృష్టి సారించాలి.

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా

మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు