లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ లో తెలంగాణ లేబర్ పార్టీ విలీనమయ్యింది. మార్చి 22న గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షులు రమేష్ తో పాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. లేబర్ పార్టీని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి సూచన మేరకు విలీనం చేసుకున్నామన తెలిపారు. పార్టీలో రమేశ్ కు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామన్నారు.