
- అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తం: మంత్రి ఉత్తమ్
హైదరబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టును ఆపే వరకు తెలంగాణ తరఫున ప్రయత్నాలు చేస్తూనే ఉంటామన్నారు. బనకచర్లను అడ్డుకునేందుకు ఇప్పటివరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సినవి ఉంటే అవి కూడా చేస్తామని చెప్పారు.
ఈ ప్రాజెక్టును మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తం” అని సెక్రటేరియెట్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చేలా అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే బనకచర్లపై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రులు, ముఖ్యంగా సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.