థర్డ్ వేవ్ పై ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం

థర్డ్ వేవ్ పై ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం

థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో హెల్త్ సిబ్బంది కొరత ఎదురవడంతో.... థర్డ్ వేవ్ లో దానికి చెక్ పెట్టబోతున్నామన్నారు సీఎం కేజ్రీవాల్. ఇందుకోసం 18ఏళ్లు దాటి 12వ తరగతి పాసైన 5వేల మందిని ఎంపిక చేసుకోబోతున్నామన్నారు. ఢిల్లీలోని యూనివర్సిటీల్లో వీరికి 2 వారాల పాటు ట్రైనింగ్  ఇస్తామన్నారు. ఓ పేషెంట్ ను ట్రీట్ చేసేందుకు అవసరమయ్యే మినిమమ్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. డాక్టర్లు, నర్సులకు వీళ్లు అసిస్టెంట్లుగా పనిచేస్తారాన్నారు కేజ్రీవాల్.