వాషింగ్టన్: ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే నుంచి అత్యంత గోప్యంగా తిరుగుపయనమయ్యారు. జులైలో తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. నాటో సమిట్ కోసం ఖతార్ కానుకగా ఇచ్చిన బోయింగ్ 7478లో అంకారా వెళ్లిన ట్రంప్.. తిరుగు ప్రయాణంలో కెమెరాల ముందు పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కారు.
లోపలికి ఎంటరైన ట్రంప్ను ఆయన భద్రతాధికారులు రహస్య మార్గంలో నుంచి ఫుడ్ ట్రక్ (క్యాటరింగ్ వ్యాన్) లోకి చేర్చారు. ట్రంప్ను ఆ ట్రక్కులో దాచి సీక్రెట్గా అమెరికా మిలటరీ విమానం ‘ఎయిర్ ఫోర్స్ సీ32ఏ’ లోకి ఎక్కించారు. ఎయిర్ఫోర్స్ వన్లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. ట్రంప్ ఆ విమానంలోనే ఉన్నారని శత్రువులను నమ్మించేందుకు, ఆయన భద్రత దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
