టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..కోర్టులో ట్రయల్స్ ప్రారంభం

 టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..కోర్టులో ట్రయల్స్ ప్రారంభం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కోర్టులు ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ కేసులో  విచారణకు  37 మంది నిందితులు హాజరయ్యారు.  ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాఖ్యా నాయక్‌, రాజేశ్వర్‌తో పాటు మిగతా నిందితులు హాజరయ్యారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆగస్టు నెలలో కోర్టులో సిట్‌ అధికారులు ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్ షీట్ లో  37 మందిని  సిట్‌ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 105 మందిని అరెస్టు చేశారు. త్వరలో మిగతా నిందితులతో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.  ఇప్పటికే ఈ కేసులో   ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ మినహా మిగతా నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.