జనరేషన్ జెడ్.. 1996 టూ 2012 మధ్య పుట్టినోళ్ల రూటే సెపరేట్.. ఎందులో అయినా వీళ్లకు వీళ్లే సాటి

జనరేషన్ జెడ్.. 1996 టూ 2012 మధ్య పుట్టినోళ్ల రూటే సెపరేట్.. ఎందులో అయినా వీళ్లకు వీళ్లే సాటి

జనరేషన్ జెడ్​.. ఈ తరం వాళ్ల మాటతీరు, ఆలోచన, బిహేవియర్, కెరీర్ గోల్స్, లైఫ్​ స్టయిల్.. ఇలా ఏ విషయం తీసుకున్నా అన్నింట్లోనూ తాము డిఫరెంట్​ అనిపించుకుంటున్నారు. ఉద్యోగం, సంపాదన, పొదుపు.. అంతెందుకు పెండ్లి విషయంలో కూడా మిగతా తరాల వాళ్ల కంటే భిన్నంగా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్లతో వరల్డ్ ఫ్యూచర్​ ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై ఇప్పటికే చాలా సర్వేలు జరిగాయి. వాటిలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి.

1996  నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్లను జనరేషన్ జెడ్​ అని పిలుస్తారు. మిలేనియల్స్​కి, వీళ్లకీ చాలా తేడా ఉంటుంది. ప్రపంచదేశాల భవిష్యత్తు వీళ్ల మీదే ఆధారపడి ఉంది. దేశ అభివృద్ధిలో వీళ్లదే ప్రధాన పాత్ర అని ఒక వైపు చెప్తూనే.. మరోవైపు వీళ్లతో అంత ఈజీ కాదు అంటున్నారు. ఎందుకంటే.. వీళ్లు అంచలంచెలుగా మారుతోన్న ఆధునిక సామాజిక పరిస్థితులను చూస్తూ పెరిగారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నారు. వీళ్లకంటూ ఒక కొత్త ఫిలాసఫీనే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. 

డిజిటల్ నేటివ్స్.. 

ఈతరం వాళ్లు డిజిటల్ యుగంలో పుట్టి, టెక్నాలజీ, ఇంటర్నెట్​, స్మార్ట్​ఫోన్, సోషల్ మీడియా వంటి వాటిని ఉపయోగిస్తూ పెరిగారు. కాబట్టి వీళ్లను ‘డిజిటల్ నేటివ్స్’ అని కూడా అంటారు. ముందు తరాలతో పోలిస్తే ప్రతి విషయాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని, పది, పదిహేనేండ్లపాటు ఒకే ఉద్యోగం, ఓవర్ టైం వర్క్​, సెలవుల కోసం మేనేజర్ ముందు నిలబడి అడగడం వంటి వాటికి వీళ్లు చాలా దూరం. సింపుల్​గా చెప్పాలంటే ఈ తరం వాళ్లు ఉద్యోగం అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గమే కాకుండా తమ ఇష్టాలు, విలువలు, పర్సనల్ గోల్స్​కు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. వీళ్లకు ఎక్కడ పనిచేస్తున్నామనేది పాయింట్ కాదు. ఎప్పుడు? ఎలా వర్క్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్. 

వర్క్​ ఫ్రం హోం, తమకు నచ్చిన టైంలో పనిచేయడం, ఫ్రీలాన్సింగ్​ ప్రాజెక్ట్​లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే.. వీటికి తగ్గట్లే వీళ్ల లైఫ్ స్టయిల్ కూడా కొత్తగా ఉంటుందన్నమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జీతం ఎంత? అనేది ప్రశ్నే కాదు వీళ్లకి. చేస్తున్న జాబ్​లో తమ టాలెంట్​ ఎలా ఉంది? ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? అనే పర్సనల్​ బ్రాండింగ్​కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జనరేషన్​ జెడ్​ కెరీర్​ కంటే పర్సనల్​ లైఫ్​ చాలా ఇంపార్టెంట్​ అని బలంగా నమ్ముతున్నారు. హెల్దీ, హ్యాపీ లైఫ్ స్టయిల్​ ఉంటే చాలు అనుకుంటున్నారు. జాబ్ సెక్యూరిటీ కంటే సెల్ఫ్​ శాటిస్​ఫాక్షన్, ఫ్యామిలీ బాండింగ్, ఇష్టమైన పనులు చేయడం వంటివి వాళ్ల ప్రాధాన్యతలు. వీళ్ల ఆలోచనకు తగ్గట్టు ఇప్పటికే కంపెనీలు కూడా తమ వర్క్​ ప్లేస్​లో మార్పులు తీసుకొస్తున్నాయి. రిమోట్ వర్క్, వర్క్​ లైఫ్ బ్యాలెన్స్ వంటి వాటిపై ఫోకస్ చేస్తున్నాయి. ఇలా వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు అందించకపోతే జెన్​ జెడ్​లతో పనిచేయించుకోవడం కంపెనీలకు కష్టమే! అనిపిస్తోంది.  

అయితే కొన్ని విషయాల్లో వీళ్లు చాలా బెటర్​గా ఉన్నారని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం జనరేషన్ జెడ్​ జనాభా దాదాపు10 కోట్లు. ఈ తరంలో 25 శాతం సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లు కాబట్టి డబ్బుల్ని పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. మిగిలిన తరాల వాళ్లతో పోలిస్తే ఈ జెన్​ జీలకు సహనం ఎక్కువ. ఏదైనా చేయాలనే ఆలోచన వస్తే ఆచరణలో పెట్టగలిగేలా ఉండాలి అనుకుంటారు. తమ వ్యక్తిగత విషయాలతోపాటు, ఫ్యామిలీకి, చేసే పనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే వీళ్లలో మానసిక సమస్యలూ ఎక్కువే. 35 శాతం కుంగుబాటుతో బాధపడుతున్నారు. 

కొత్త స్కిల్ నేర్చుకోవాలనే తపన

ఉడెమీ రిపోర్ట్ ప్రకారం 98 శాతం జెన్ జెడ్​లు వారానికి ఒక గంట ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి టైం కేటాయిస్తున్నారు. వాళ్లు కొత్త స్కిల్​ నేర్చుకోవడానికి ఉపయోగించే ముఖ్యసాధనం ఆన్​లైన్. అందులోనూ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ కంటెంట్​కి పాపులారిటీ పెరుగుతుండడంతో దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఏఐ గురించి ఆన్​లైన్​లో ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ల పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్​ కోసం దృఢ నిశ్చయంతో ఉన్నారు. మిలేనియల్స్​తో పోలిస్తే 93 శాతం ఎక్కువ అంకితభావం కలిగి ఉన్నారు. 

సాధారణంగా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే మోటివేషన్ కూడా ప్రధానం. ఈ సర్వేలో భాగంగా జెన్​ జెడ్​ లెర్నర్స్​కి మోటివేషన్ ఎలా వస్తుంది అని చూస్తే.. సంపాదించే కెపాసిటీ పెరగడం, వ్యక్తిగత అభివృద్ధి, పోటీ ప్రపంచంలో స్థిరంగా నిలబడగలగడం వంటి అంశాలు అని తేలింది. అందుకే కరోనా టైంలో జెన్​ జెడ్​లు మిగిలిన తరాల వాళ్లలా మానసికంగా దిగులుపడలేదు. మొదట్లో కొన్నిరోజులు ఇబ్బంది పడినా ఆ తర్వాత ఇంటర్నెట్​ సాయంతో అనేక విషయాలు తెలుసుకున్నారు. 

అనుభవానికే విలువ

డెలాయిట్ కంపెనీ ‘2025 డెలాయిట్ గ్లోబల్ జెన్ జెడ్ అండ్ మిలీనియల్’ సర్వే చేసింది. అందులో 809 ఇండియన్ ప్రొఫెషనల్ ఎక్స్​పర్ట్స్, 505 మంది జెన్​ జెడ్​లు, 304 మంది మిలీనియల్స్ నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకున్నారు. దాని ప్రకారం దేశంలోని 30 ఏండ్ల లోపు జెన్​ జెడ్​, 45 ఏండ్లలోపు మిలేనియల్స్ ప్రొఫెషనల్ నిర్ణయాల్లో కెరీర్ డెవలప్​మెంట్, లెర్నింగ్​ ఆపర్చునిటీస్​కు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఫ్యూచర్​లో అవసరమయ్యే వాటికి అనుగుణంగా మారుతున్నారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటున్నారు. వారానికొకసారి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి 85 శాతం మొగ్గుచూపుతున్నారు. మేనేజర్ల నుంచి ఎఫెక్టివ్ మెంటార్​షిప్​ కోరుకునే వాళ్లలో సగం మంది మాత్రమే దాన్ని పొందగలుగుతున్నారు.

 ప్రస్తుతమున్న జాబ్​ మార్కెట్​ గురించి మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు జెన్​ జీలు. 94 శాతానికి పైగా జెన్​ జడ్​లు, 97 శాతం మంది మిలీనియల్స్ థియరీ కంటే ప్రాక్టికాలిటీ, అనుభవాని​కే వాల్యూ ఇస్తున్నారు. 52 శాతం జెన్​ జెడ్​లు, 45 శాతం మంది మిలీనియల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లేదని చెప్తున్నారు. 33 శాతం జెన్​ జెడ్​లు, 29 శాతం మిలేనియల్స్ ఎక్కువ సమయం ఒత్తిడికి గురవుతున్నట్టు చెప్పారు. అందులో జాబ్​ పరంగా ఒత్తిడికి గురయ్యేవాళ్లే ఎక్కువ. ఉద్యోగ సంస్థలు డెవలప్​మెంట్, ఇన్వెన్షన్స్, కంటిన్యూస్ లెర్నింగ్​ వంటి వర్క్ కల్చర్​ని ఫాలో అవ్వాలి. శారీరక, మానసిక, ఆర్థిక శ్రేయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అలాగే ఉద్యోగంలో నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జెన్​ ఏఐ టెక్నాలజీని వాడుతున్న వాటిపై యువత కెరీర్​ ఎంచుకోవాలి అని డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ చెప్పారు.