దివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

దివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

హైదరాబాద్: దివ్యాంగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కేంద్రమంత్రి రాందాస్ అథవాలె హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశామని తెలిపారు. 

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాందాస్ అథవాలె  మాట్లాడారు. తమ పార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని వివరించారు. దివ్యాంగులు సమాజంలో ఏ ఒక్కరికీ తీసిపోరని.. వారిలోని అసాధారణ శక్తులను గుర్తించి ప్రోత్సహించడం మన బాధ్యత అని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె అన్నారు.