- విరాట్ కోహ్లి అసహనం
దుబాయ్: పాకిస్తాన్తో మ్యాచ్లో డకౌటైన స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్ నుంచి తప్పించి ఇషాన్ కిషన్ ఆడించాలన్న సూచనపై ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అసలు రోహిత్ను డ్రాప్ చేయాలన్న ప్రశ్ననే తను నమ్మకలేకపోయాడు. ఆదివారం పాక్తో మ్యాచ్లో ఓటమి తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్.. రోహిత్ బదులు ఫామ్లో ఉన్న ఇషాన్ను తీసుకోకుండా తప్పు చేశారని భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన విరాట్.. ‘ఇది చాలా బోల్డ్ క్వశ్చన్. అసలు మీరేం అనుకుంటున్నారు సర్? నేనైతే బెస్ట్ టీమ్తోనే ఆడానని భావిస్తున్నా. మీ అభిప్రాయం ఏంటి? టీ20 టీమ్ నుంచి రోహిత్ శర్మను డ్రాప్ చేస్తారా? మీరు రోహిత్ను తప్పిస్తారా? మా చివరి మ్యాచ్లో తను ఏం చేశాడో తెలుసా. అస్సలు నమ్మలేకపోతున్నా’ అంటూ కోహ్లీ తలపట్టుకున్నాడు.