నాలుగు రోజుల గల్లంతైన యువతి.. కుళ్లిన స్థితిలో డెడ్‌బాడీ

నాలుగు రోజుల గల్లంతైన యువతి.. కుళ్లిన స్థితిలో డెడ్‌బాడీ

యాదాద్రి జిల్లా: నాలుగు రోజుల క్రితం గల్లంతైన యువతి డెడ్‌బాడీ కుళ్లిన స్థితిలో దొరికింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం వద్ద దోసల వాగులో గల్లంతైన హిమ బిందు అనే యువతి మృతదేహాన్ని తన అక్క డెడ్‌బాడీ దొరికిన చోటుకు దగ్గరలోనే పోలీసులు గుర్తించారు.

ఆగస్టు 30న శ్రవణ్‌ కుమార్ అనే వ్యక్తితో బైక్‌పై సింధుజ (26), హిమబిందు (23) అనే అక్కాచెల్లెళ్లు బొందుగుల గ్రామం వెళ్తుండగా దోసల వాగులో గల్లంతయ్యారు. వాగు వరద ఉధృతి పెరగడంతో ఆ ముగ్గురూ కొట్టుకోయినప్పటికీ శ్రవణ్ కుమార్ సేఫ్‌గా ఒడ్డుకు చేరుకోగలిగాడు. కానీ ఆ యువతులిద్దరూ వాగులో గల్లంతయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టారు. సోమవారం రెండ్రోజుల క్రితమే సింధుజ మృతదేహం దొరకగా, ఇవాళ కుళ్లిపోయిన స్థితిలో హిమబిందు డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఆమె అక్క డెడ్‌బాడీ దొరికిన చోటుకు సమీపంలోనే హిమబిందు మృతదేహం కనిపించింది.