మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు

మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు
  • పదిలో  వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్లాన్​ రెడీ చేయాలి 
  • కలెక్టర్ హరిచందన దాసరి రివ్యూ 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత  ఉండొద్దని, జిల్లాలో సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలన్నారు. 

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. డీఈఓ, విద్యాశాఖ అధికారులతో  సమావేశం నిర్వహించారు. 

చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం ఎంజీ నగర్ లోని మురాద్ నగర్, చాచా నెహ్రూ నగర్ లో అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంధుల హాస్టల్, బస్తీ  దవఖానాను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.