ENG vs IND 2025: నవ్వడానికి కొంచెమైనా సిగ్గుండాలి.. జైశ్వాల్‌పై నెటిజన్స్ ఫైర్

ENG vs IND 2025: నవ్వడానికి కొంచెమైనా సిగ్గుండాలి.. జైశ్వాల్‌పై నెటిజన్స్ ఫైర్

టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. సెంచరీ కొట్టినా అంతకు మించిన తప్పులు చేసి విమర్శలకు గురవుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు క్యాచ్ లు జారవిడిచి మ్యాచ్ ను ఇంగ్లాండ్ చేతుల్లో పెట్టాడు. ఫీల్డింగ్ పొజిషన్ ఎక్కడైనా సరే జైశ్వాల్ అలవోకగా వస్తున్న క్యాచ్ లు అందుకోలేకపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు జారవిడిచి ఈ టీమిండియా ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన డకెట్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.

ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జైశ్వాల్ క్యాచ్ మిస్ చేయడం మ్యాచ్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించింది. సిరాజ్ వేసిన షార్ట్ బంతిని డకెట్ పుల్ షాట్ ఆడాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బాల్ అక్కడే లేచింది. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 97 పరుగుల వద్ద బతికిపోయిన ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను విజయం అంచులకు చేర్చాడు. 

►ALSO READ | ENG vs IND 2025: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా ఆడేది రెండు టెస్టులే

క్రికెట్ లో క్యాచ్ లు మిస్ చేయడం సహజం. కానీ జైశ్వాల్ ఆటిట్యూడ్ ఇప్పుడూ ఎవరికీ నచ్చడం లేదు. ఇంగ్లాండ్ 44 పరుగులు చేయాల్సిన దశలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ నవ్వుతూ కనిపించాడు. డ్యాన్స్ చేస్తూ కొంచెమైనా ఓటమి బాధ లేకుండా చిల్ అవుతూ కనిపించాడు. దీంతో ఈ యువ ఓపెనర్ ను నెటిజన్స్ టార్గెట్ చేశారు. మ్యాచ్ కీలక సమయంలో ఉన్నప్పుడు క్యాచ్ లు మిస్ చేసి బౌండరీ వద్ద ఎలా నవ్వుతున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది సిగ్గుమాలిన చర్య అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. కాగా.. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ జైశ్వాల్ (101) సెంచరీతో దుమ్ములేపాడు. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులకే ఔటయ్యాడు.   

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 2 న ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది.