కోటిమంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్

కోటిమంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్

న్యూఢిల్లీ: దేశంలో 15 నుంచి 18  ఏండ్ల వయసున్న కోటి మంది టీనేజర్లకు రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తయిందని కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్​సుఖ్ మాండవీయ బుధవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 5.04 కోట్ల మంది టీనేజర్లు ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ద్వారా దేశ భవిష్యత్​ను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో 15–18 ఏండ్ల వయసున్న టీనేజర్ల సంఖ్య 7.4 కోట్లుగా ఉంది.