ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

శంషాబాద్,వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న ఓ ప్యాసింజర్  బంగారాన్ని పేస్టులా మార్చి తీసుకొచ్చాడు. స్కానింగ్​లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 970 గ్రాముల గోల్డ్ పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 47 లక్షల 55 వేల 642 ఉంటుందని అంచనా వేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న మరో ప్యాసింజర్ బంగారాన్ని తరలిస్తుండగా.. అధికారులు గుర్తించారు. అతడి దగ్గరి నుంచి 442.6 గ్రాముల గోల్డ్ పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.21 లక్షల 70 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ప్యాసింజర్లపై కేసు ఫైల్ చేసి విచారిస్తున్నట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు.