ఖమ్మంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఒకరి మృతి

ఖమ్మంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఒకరి మృతి

ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు  జిల్లాలోని కొణిజర్ల మండలం లక్ష్మీపురం  దగ్గర అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.