వరంగల్, వెలుగు: వరంగల్ కేంద్రంగా జరుగుతున్న ఫేక్ ఇన్సూరెన్స్ బాండ్ల బాగోతం బయటపడింది. వెహికల్స్కు ఇన్సూరెన్స్ కంపల్సరీ కావడంతో 10 మంది ఏజెంట్లు రెండు ముఠాలుగా దందా మొదలుపెట్టారు. వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ల కోసమొచ్చే వారిని టార్గెట్ చేశారు. వేలల్లో డబ్బులు తీసుకుని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర ఫేక్ బాండ్లు తయారు చేసి ఇచ్చేవారు. రెండు ముఠాలు దాదాపు 10 వేల మందిని ఫేక్ బాండ్లతో మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫేక్ బాండ్లను సృష్టించిన 8మందితో పాటు ఇద్దరు ఆర్టీఏ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి మంగళవారం వెల్లడించారు.
సపరేట్ యాప్స్, క్యూఆర్ కోడ్స్
వరంగల్లో ఆర్టీఏ ఏజెంట్లుగా పని చేస్తున్న వీరంతా జీతం సరిపోక ఫేక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ల మోసాలకు తెర తీశారు. క్యూఆర్ కోడ్ మేకర్, బార్ కోడ్ జనరేషన్, బైక్స్ స్కౌట్స్, నైట్రొ పీడీఎఫ్ వంటి యాప్లు డౌన్లోడ్ చేశారు. ఈ యాప్ల సాయంతో ఎవరో ఒకరి ఇన్యూరెన్స్బాండ్ ఓపెన్ చేసి.. అందులోని అసలు పేరు, వెహికల్ డీటెయిల్స్, ఇతర ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి డబ్బులు వసూలు చేసిన వారి వివరాలు ఎంటర్ చేసేవారు. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపనీల పేర ఫేక్ బాండ్ ఇచ్చేవారు. ఆర్టీఏ ఆఫీస్ స్టాంపులను కూడా తయారు చేసి ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కో వెహికల్కు రూ.2 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేశారు.
క్లెయిమ్ కోసమెళ్తే.. ఫేక్ అని తెలిసింది
ఈ ముఠా నుంచి ఇన్సూరెన్స్ బాండ్ తీసుకున్న ఒకరి వాహనానికి ఈ మధ్యనే యాక్సిడెంట్ కాగా.. క్లెయిమ్ కోసమని ఇన్సూరెన్స్ఆఫీస్ వెళ్లాడు. బాండ్ను పరిశీలిస్తే అది ఫేక్ అని తేలడంతో వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీసుస్టేషన్లో కంప్లైంట్ చేశారు. టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ఇంతేజార్గంజ్, మిల్స్కాలనీ పోలీసులు దాడులు చేసి ముఠాసభ్యులను పట్టుకున్నారు. వాహనదారులకు ఆర్టీఏ ఆఫీస్ నుంచి పోస్ట్లో రావాల్సిన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ లు కూడా వీరి దగ్గర దొరికాయి.
ప్రీమియం రేట్ తక్కువనగానే.. ఎగవడ్డరు
దాదాపు పదివేల మంది ఫేక్ బాండ్ల తీసుకుని మోసపోయారని సీపీ తరుణ్జోషి తెలిపారు. ఈ దందావల్ల రూ.90 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్నారు. తక్కువ ప్రీమియం అనడంతో చాలామంది అమాయకులు వీరి దగ్గర ఇన్సూరెన్స్ బాండ్లు తీసుకున్నట్టు చెప్పారు. లారీకి బీమా చేయించాలంటే మామూలుగా కంపెనీలు రూ. .50 నుంచి 60 వేలు ప్రీమియం కలెక్ట్ చేస్తాయి. కేవలం రూ. 10 వేలకే బీమా చేయిస్తామనడంతో వీరిని ఆశ్రయించారు. ముఠా సభ్యుల నుంచి రూ.4 లక్షల 46 వేల నగదు, 3 ల్యాప్టాప్లు, 2 కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5 బైకులు, 10 సెల్ఫోన్లు, 433 ఒరిజినల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డులతో పాటు ఫేక్ బాండ్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సైలు లవణ్కుమార్, ప్రియదర్శిని, స్వామి, కుమారస్వామితీ సీపీ అభినందించారు.
ముఠా సభ్యులు వీరే..
ఎండీ షఫీ (కొండపర్తి), సయ్యద్ జహంగీర్ (కాశిబుగ్గ), పెన్నల రాజేశ్ (పుప్పాలగుట్ట) వాంకిడి నిఖిల్(లెనిన్నగర్), మామిడి రాజు
( శివనగర్), నాగమల్లి శివకుమార్
( కాశిబుగ్గ), అల్లాడి రాజ్కుమార్
( హంటర్రోడ్), గుండబోయిన శ్రీకాంత్
( వంగపహాడ్), కేశోజు రాజ్కుమార్ (గుడిబండల్), బల్లాని సుమన్ (నర్సంపేట)