విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యం

విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యం

చిత్తూరు జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. వారి కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి విహారయాత్రకు వెళ్లిన ఉద్యోగుల నుంచి.. నిన్నటి నుండి ఎలాంటి స‌మాచారం లేదు. వారి ఫోన్లు స్విచ్ఛాప్ వస్తున్నాయని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఆదివారం నాడు సెలవు కావడంతో సహచర ఉద్యోగులంతా కలిసి టూర్ కు ప్లాన్ చేసుకొన్నారు. ఒక్కసారిగా అందరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి అందరి ఫోన్లు ఎందుకు పనిచేయడం లేదనే ఆందోళన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాల్లో నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై పోలీసులు బ్యాంకు ఉద్యోగుల కోసం ఆరా తీస్తున్నారు. విహారయాత్రకు వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు ఏమయ్యారనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది.