ఏపీ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో .. కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం

ఏపీ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో .. కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం

హాష్ ఆయిల్ సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని రాచకొండ  పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి 52 లక్షల రూపాయల విలువ చేసే 10.2 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. హష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు,  రాంబాబు ఆంధ్రప్రదేశ్ చెందిన వారీగా గుర్తించారు పోలీసులు. అల్లురి సీతారామ రాజ్ జిల్లా నుంచి హాష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారు. సమాచారం అందడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు ఏపీలో తయారు చేసి తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో  గోవిందరావు & రాంబాబుకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. 480 కేజీల గంజాయి మరిగించి  10 లీటర్ల హాష్ అయిల్ తయారు చేశారని పోలీసులు తెలిపారు. డీసీపీ భువనగిరి ఎస్ ఓటీం ఎఫర్ట్స్ పెట్టీ వీరిని పట్టుకున్నారు. 

Also Read :- TGS ICET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

మరో వైపు వైజాగ్  వెజిటేబుల్ మార్కెట్ నుంచి ఉల్లిగడ్డ లోడ్ లో గంజాయి  సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నాసిక్ మహారాష్ట్ర రోడ్డు మార్గం మీదుగా గంజాయిని హైదరాబాద్ సరఫరా చేస్తున్నారు. మారుతి స్విఫ్ట్ కారు లో ఈ ముఠా గంజాయి తరలిస్తున్నారు.సమాచారం మేరకు పోలీసులు ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు.   మహారాష్ట్ర చెందిన వాల్మీకి & దేవ్రం చౌహాన్ ను  అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. వీరి దగ్గరి నుంచి 60 కిలోల గంజాయి సీజ్ చేశామని చెప్పారు.