సిక్కిం రాష్ట్రంలో ‘సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ – SDF’ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ మినహా మిగితా ఎమ్మెల్యేలంతా బీజేపీ వర్కింగ్ ప్రెసిడంట్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ పాలన చూసే ఇతర పార్టీల నేతలు వస్తున్నారన్నారు రామ్ మాధవ్. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పార్టీ మారిన SDF ఎమ్మెల్యేలు చెప్పారు.

