26/11 దాడి జరిగి నేటికి 11 సంవత్సరాలు

26/11 దాడి జరిగి నేటికి 11 సంవత్సరాలు

26/11.. ఆ డేట్ వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అవును ఆరోజు ముంబాయిలో జరిగిన మారణకాండ అటువంటిది మరి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు చెందిన 10 మంది ముష్కరులు సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. సాయుధులైన ఆ 10 మంది ముంబాయిలో 12 చోట్ల దాడులు జరిపారు. ఆనాటి దాడుల్లో 166 మంది చనిపోగా..300 మందికిపైగా గాయపడ్డారు. నవంబర్ 26, 2008న ప్రారంభమైన.. ఈ దాడులు మూడు రోజుల పాటు ముంబాయి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేసి నవంబర్ 29, 2008న ముగిశాయి. ఈ దాడుల్లో కీలక పాత్ర వహించిన ఉగ్రవాది కసబ్. మూడు రోజుల కాల్పుల తర్వాత అతన్ని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఆ తర్వాత కోర్టుల చుట్టు తిప్పీ.. తిప్పీ.. చివరికి నవంబర్ 21, 2012న పూణేలోకి యరవాడ జైలులో ఉరి తీశారు. 26/11 దాడులలో అమాయకులైన 166 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అది జరిగి నేటికి 11 సంవత్సరాలు గడిచింది. ప్రాణాలొదిలిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌లు పోలీస్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు.