లోయలో పడ్డ బస్సు..12 మంది మృతి

లోయలో పడ్డ బస్సు..12 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాల్‌ చోక్ జిల్లాలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.  పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం..ఇవాళ ఉదయం 8:30  (ఆదివారం) గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కాలిన్‌చౌక్‌ ఆలయం నుండి  40 మంది యాత్రికులతో వెళ్తుండగా డోలఖా ఖాదీచౌర్-జిరి రోడ్ వద్దకు రాగానే అదుపు తప్పి 500 మీటర్ల లోతు లోయలో పడిందని చెప్పారు.