ఇంటికొకరికి వైరల్ ఫీవర్ ..నెలలో 12 మంది మృతి

ఇంటికొకరికి  వైరల్ ఫీవర్ ..నెలలో 12 మంది మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం తిరుమలకుంటలో వైరల్ ఫీవర్స్ తో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంటికొకరు జ్వరంతో మంచంపట్టారు. నెల రోజుల్లోనే 12 మంది జ్వరంతో చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఏటా  జూలై, ఆగస్టు నెలలో గ్రామంలో విషజ్వరాలు వస్తుంటాయి. తాగే నీరు కలుషితం కావడం వల్లే రోగాలబారిన పడుతున్నామని స్థానికులు చెప్పడంతో .. గతంలో నీటిని పరీక్షించారు. మళ్లీ ఈసారి జ్వరాలు రావడంతో కారణాలు తెలియడం లేదంటున్నారు జనం. గ్రామంలో విషజ్వరాలతో 20 మంది చనిపోగా... 12 మంది మృతి చెందినట్లు రికార్డయిందంటున్నారు. జ్వరాల బాధితుల్లో కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు నలుగురున్నారని చెబుతున్నారు డాక్టర్లు.