![శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు](https://static.v6velugu.com/uploads/2024/05/rush-increased-in-srisailam-templejpg2_NJmtAaDbj6.jpg)
- నిండిపోయిన క్యూలైన్లు
- స్వామి దర్శనానికి 4గంటలు
హైదరాబాద్: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు నిండిపోయాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు.