తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు నమోదవ్వగా మరో ఆరుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,13,084 కు చేరగా మరణాల సంఖ్య 1228 కి చేరింది. నిన్న ఒక్కరోజే 2214 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,87,342కు చేరింది. ఇంకా 24,514 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 228 నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 30,210 శాంపిల్స్ పరీక్షించగా  అక్టోబర్ 11 నాటికి రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 35,77,261 కు చేరింది.

అమ్మాయిలకు ఇంటర్ పాస్ ఐతే రూ.25 వేలు.. డిగ్రీ పాస్ ఐతే రూ.50 వేలు