
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కారుణ్య నియామకాల్లో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ లో రెండు రోజులుగా నిర్వహించిన మెడికల్ బోర్డులో 135 మంది కార్మికులను అక్కడి డాక్టర్లు అన్ ఫిట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకుంటే, సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహిస్తుంది.
సోమ, మంగళవారాల్లో నిర్వహించిన మెడికల్ బోర్డుకు 204 మందిని సింగరేణి యాజమాన్యం పిలిచింది. 174 మంది కార్మికులు అటెండ్ కాగా, 30 మంది గైర్హాజరయ్యారు. మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహించేందుకు యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టిందని సీఎండీ బలరాం నాయక్ తెలిపారు.