కాశీబుగ్గ, వెలుగు: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం 139 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సుమలు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 54, పీడీ హౌసింగ్కు 21, జీడబ్ల్యూఎంసీ (వరంగల్)కు 18 దరఖాస్తులు ఉండగా, మిగతా శాఖలకు సంబంధించినవి 46 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

