నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల కస్టడీ

నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల కస్టడీ

విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు

ముంబై: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు బాంద్రా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ముంబై పోలీసులు వీళ్లిద్దరినీ శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో నవనీత్ తరఫు లాయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 29న విచారణ జరగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే చాలీసా పఠించాలని, లేదంటే తామే ఆయన ఇంటిముందు చాలీసా పఠిస్తామని నవనీత్ దంపతులు సవాల్ చేశారు. ఈ కామెంట్లు అల్లర్లకు దారితీసే అవకాశముందంటూ ముంబై పోలీసులు వాళ్లిద్దరిమీద కేసులు పెట్టారు.