హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్ డిపోల వద్ద ఈ రోజు 144 సెక్షన్ ప్రకటిస్తున్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేస్తున్న సమ్మె 43వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ రోజు ‘బస్ రోకో’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘బస్ రోకో’ కార్యక్రమం వల్ల వ్యాపారాలకు, విద్యార్థులకు చాలా నష్టం వాటిల్లుతుంది. అందువల్ల ఏ బస్ డిపో దగ్గర నలుగురు కన్నా ఎక్కువ మంది గుమ్మికూడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆర్టీసీ ప్రధాన డిమాండైన విలీనం డిమాండ్ను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు జేఏసీ నేతలు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. విలీనం డిమాండ్ కాకుండా మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం చర్చ జరపాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.
బస్ డిపోల దగ్గర 144 సెక్షన్
- హైదరాబాద్
- November 16, 2019
లేటెస్ట్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం
- హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నరు : తన్నీరు హరీశ్రావు
- తల్లి, అక్క మందలించారని సూసైడ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ