సరిహద్దు వెంట 16 ఉగ్ర సంస్థలు

సరిహద్దు వెంట 16 ఉగ్ర సంస్థలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 16 ఉగ్రవాద శిక్షణ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు భారత ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలు తెలిపాయి. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ..పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ చర్యలు మొత్తం తమ నిఘా నీడలో ఉన్నట్లు చెప్పాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఎటువంటి దుశ్చర్యకు పాల్పడ్డా తగిన సమాధానం చెప్పేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నాయి. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఆర్మీ అధికారులు.