160 కిలోల నల్లమందు సీజ్

160 కిలోల నల్లమందు సీజ్

హైదరాబాద్, వెలుగు : దూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు భారీగా నల్లమందును సీజ్ చేశారు. శనివారం రూ.1.5 కోట్ల విలువైన 160 కిలోల నల్ల మందును పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. దూల్​పేటకు చెందిన దేవేందర్ కాసినియా(21), సికింద్రాబాద్ లో ఉండే కె.తాజారామ్ ఇంటిపై దాడి చేయగా160 కిలోల నల్లమందు దొరికింది.

కాసినియా తండ్రి రాజస్థాన్ నుంచి నల్లమందు తెచ్చి సిటీలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో గత 15 రోజులుగా నిఘా పెట్టి పట్టుకున్నారు. ఓ వ్యాను, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ అధికారులను అభినందించారు.