జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఆదివారం జంట పేలుళ్లు జరిగాయి. జమ్మూలోని హై సెక్యూరిటీ టెక్నికల్ ఏరియా అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఆదివారం వేకువజామున ఈ బాంబ్ అటాక్స్ జరిగాయి. పేలుళ్ల ధాటికి విమానశ్రయంలోని ఓ భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అధికారులెవరకీ గాయాలవ్వలేదన్నారు.
‘జమ్మూలోని టెక్నికల్ ఏరియా అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద తక్కువ తీవ్రత కలిగిన రెండు జంట పేలుళ్లు జరిగాయి. ఒక బాంబ్ పేలుడు ధాటికి ఓ భవనం పైకప్పు దెబ్బతింది. మరో బాంబ్ పేలుడు బహిరంగ ప్రాంతంలో జరగడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. అలాగే ఈ పేలుళ్లతో ఎలాంటి పరికరాలు పాడవ్వలేదు. ఈ ఘటనపై సివిల్ ఏజెన్సీలు విచారణ చేస్తున్నాయి’ అని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఐఏఎఫ్ పేర్కొంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీమ్లు త్వరలో ఘటనా స్థలానికి చేరుకోనున్నాయని తెలిసింది.
Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area.
— Indian Air Force (@IAF_MCC) June 27, 2021
There was no damage to any equipment. Investigation is in progress along with civil agencies.
— Indian Air Force (@IAF_MCC) June 27, 2021