జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ బ్లాస్ట్ 

జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ బ్లాస్ట్ 

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం జంట పేలుళ్లు జరిగాయి. జమ్మూలోని హై సెక్యూరిటీ టెక్నికల్ ఏరియా అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ సమీపంలో ఆదివారం వేకువజామున ఈ బాంబ్ అటాక్స్ జరిగాయి. పేలుళ్ల ధాటికి విమానశ్రయంలోని ఓ భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అధికారులెవరకీ గాయాలవ్వలేదన్నారు.

‘జమ్మూలోని టెక్నికల్ ఏరియా అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద తక్కువ తీవ్రత కలిగిన రెండు జంట పేలుళ్లు జరిగాయి. ఒక బాంబ్ పేలుడు ధాటికి ఓ భవనం పైకప్పు దెబ్బతింది. మరో బాంబ్ పేలుడు బహిరంగ ప్రాంతంలో జరగడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. అలాగే ఈ పేలుళ్లతో ఎలాంటి పరికరాలు పాడవ్వలేదు. ఈ ఘటనపై సివిల్ ఏజెన్సీలు విచారణ చేస్తున్నాయి’ అని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఐఏఎఫ్ పేర్కొంది. ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ టీమ్‌లు త్వరలో ఘటనా స్థలానికి చేరుకోనున్నాయని తెలిసింది.