సున్తీ కోసం ఆర్ఎంపీ దగ్గరకు వెళితే పురుషాంగం కోసేశాడు

సున్తీ కోసం ఆర్ఎంపీ దగ్గరకు  వెళితే పురుషాంగం కోసేశాడు

ఈ మధ్య ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలవుతున్నాయి. వచ్చిరానీ వైద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఏప్రిల్  29న వర్దన్న పేటలో జ్వరం వచ్చిన ఓ వ్యక్తికి ఆర్ఎంపీ డాక్టర్ గంట వ్యవధిలోనే 7 ఇంజిక్షన్లు ఇవ్వడంతో  రెండు రోజుల్లోనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా  సున్తీ కోసం వచ్చిన ఓ బాలుడి పురుషాంగాన్ని కోసేశాడు ఆర్ఎంపీ .దీంతో బాలుడి పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చింది.  ఈ ఘటన  ఖమ్మం జిల్లాలో జరిగింది

ఖమ్మం నగరంలోని ఆర్డీవో కార్యాలయానికి దగ్గర్లో హమీద్ క్లినిక్‌ ఉంది. ఈ క్లినిక్‌కి సున్తీ కోసం ఓ వ్యక్తి తన కొడుకుని తీసుకువచ్చాడు. అయితే  సున్తీ చేయబోతూ పురుషాంగం కోసేశాడు ఆర్ఎంపీ. దీంతో మర్మాంగం తెగిపోవడంతో విపరీతమైన రక్తస్రావమై  బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తరలించారు బాధిత కుటుంబ సభ్యులు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.